UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 వెంకటేశ్వరస్వామికి బంగారు కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీష్ రావు.!

తెలంగాణ రాష్ట్ర సమితి (భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారింది) సీనియర్ నేత, తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు, సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పీఠాధిపతికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ విగ్రహ సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహం ఖరీదు కోటి రూపాయల పై మాటే. ఆలయ నిర్వాహకులు కిలో బంగారాన్ని అందించగా, మిగిలిన మొత్తాన్నీ హరీష్ రావు సహా దాతలు అందించారు.

పోటెత్తిన భక్తులు.. కాగా, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న వెంకటేశ్వరస్వామి ని మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక, పొరుగు జిల్లాల నుంచీ పెద్దయెత్తున భక్తులు ఆలయానికిచేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాంతో ఆ ప్రాంతమంతా భక్త జన సంద్రంలా మారిపోయింది. కాగా, తెలంగాణ జీవన్ దాన్ విధానం దేశానికే ఆదర్శనమనిమంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. హైద్రాబాద్‌లోని జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన జీవన్ దాన్ ఆర్గనైజేషన్ అవగాహనా కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !