UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 సామాన్యుల చెంతకు సత్వర న్యాయం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి

సామాన్యుల చెంతకు సత్వర న్యాయం
ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి
జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 07.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామంలోని రైతువేదికలో న్యాయ అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగ పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.బానుమతి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల గ్రామాలలో ప్రజలకు చట్టాల పట్ల కనీస అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం నుంచి వారికి అందుతున్నటువంటి కనీసం మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ.. గ్రామాలలో భూమికి సంబంధించిన న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు ను చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. రాజ్యాంగం ప్రకారం న్యాయం పొందడం ప్రతి పౌరుని కనీస హక్కు అని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కనీస బాధ్యత వారి కుమారులపై ఉంటుందని కనీస పోషణ వారి బాధ్యత అని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమని అత్యధికంగ జరుగుతున్న ప్రమాదాలు వారి యొక్క నిర్లక్ష్యం వలనే జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా ఇన్సూరెన్స్ ని విధిగా చేయించుకోవాలని తెలిపారు. రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించడం కోసం లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని తద్వారా డబ్బు సమయం ఆదవుతుందని ఇరువురు మనసులను గెలుచుకోవచ్చని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.దీప తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం భార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్యులు తోట మల్లేశ్వరరావు,మెండు రాజమల్లు ఎండీ సాధిక్ పాషా, రమణ ములకలపల్లి ఎస్సై, కానిస్టేబుల్స్, సర్పంచులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !