UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 ఇద్దరు దొంగలు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

 

మన్యం న్యూస్, సారపాక :

బూర్గంపాడు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బూర్గంపాడు ఎస్సై సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… శనివారం ఉదయం సారపాక పట్టణంలో బూర్గంపాడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ తిరుగుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులను బూర్గంపాడు పోలీసులు వెంబడించి పట్టుకొని విచారించారు. విచారణలో సారపాక గాంధీనగర్ వాంకుడోత్ సాయి , అన్నపురెడ్డిపల్లికి చల్లా వెంకటేశ్వర్లు చెందిన వ్యక్తులుగా వారిని గుర్తించారు. వీరు ఇరువురు జల్సాలాకు అలవాటుపడి గత సంవత్సరం మార్చిలో సారపాక పంచాయతీలోని రాజీవనగర్ కాలనీలో ఎవరూ లేని ఇంటిని చూసి ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులు దొంగిలించరాని ఒప్పుకున్నారు. వీరు దొంగిలించిన వస్తువులను పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 4లక్షల రూపాయలు ఉంటుంది తెలిపారు. తదనంతరం దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను రిమాండ్ కు తరలించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను చాకచక్యంగా వ్యవహరించిన బూర్గంపహాడ్ పోలీసులను స్థానికులు, ఉన్నతధికారులు అభినందిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !