UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 బతుకు చిద్రం గతి తప్పుతున్న ఆదివాసి యువత

  • బతుకు చిద్రం
  • గతి తప్పుతున్న ఆదివాసి యువత..
  • చదువులకు దూరమై చెడు వ్యసనాలకు బానిసై.
  • జీవితాలు ఆగమాగం

    మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 06:

చెడు వ్యసనాలే వారి జీవితాలకు శాపం అవుతున్నాయి . చెప్పేవారే లేరని కొందరు చెప్పిన మాట వినని వారు మరికొందరు చెడు వ్యసనాలు వారి బతుకులు చిద్రం చేసుకుంటున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. పెద్ద చదువులు చదువుకొని జీవితాలను చక్కదిద్దుకోవడమే కాకుండా కనిపించిన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటారని రెక్కలు ముక్కలు చేసుకుని కూలి పనులకు వెళుతూ కన్న కొడుకులను పెంచుతున్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగులుస్తున్నారు. చదువుకొని బతుకులను బాగు చేసుకుంటాడని కలలుగన్న ఆ తల్లిదండ్రులకు మధ్యలోనే చదువు మానేసి మద్యం ,సిగరెట్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు వ్యసనపరులై అ చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. యుక్త వయసులోనే వ్యసనపరులై. సభ్య సమాజానికి తలనొప్పిగా మారుతున్నారు. ప్రధానంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వ్యసనాలకు బానిసై వారి వారి కుటుంబాలకు బరువై చివరకు జీవత్సవంలా మిగిలిపోతున్నారు యువత మేలుకోవాలని సన్మార్గంలో నడవాలని ప్రభుత్వాలు అనేక విధాలుగా చైతన్య పరుస్తూ వారి చెడు నడవికను మార్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ యువత పెడచెవిన పెడుతున్నారు. లక్ష్యసాధన దిశగా ఎంచుకున్న మార్గాన్ని వారి జీవితాల్లో సుగమనం కావలసింది పోయి మత్తుకు బానిసలై సముదులుగా మిగులుతున్నారు . ఏజెన్సీలో యువత వీటికి ఎక్కువగా బానిస అవుతున్నారు
ప్రధానంగా పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతున్న గంజాయిని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని మేధావి వర్గం ఆరోపిస్తుంది

యువత మేలుకో జీవితాలను సరిదిద్దుకో.. సీఐ దోమల రమేష్..
సమాజం నిత్యం సస్యశ్యామలంగా ఉండాలంటే యువత ఎందుకు ప్రమాద భూమికగా నిలబడాలి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత మేలుకోవాలి వారి జీవితాలను సరిదిద్దుకోవాలి. ప్రతిభ ఉన్న యువతకు
ఉద్యోగ నియామకల్లో ఎటువంటి సహాయం కావాలన్నా పోలీస్ శాఖ తరపున అందిస్తామని దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ తెలిపారు. మండలంలోని యువతి, యువకులు ఎవరైనా వచ్చి తెలిపితే వారికి ఉచితంగా కోచింగ్ మా తరఫున అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ నోటిఫికేషన్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని, యువత చెడు వ్యసనాలకు పోకూడదని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !