UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 బతుకు చిద్రం గతి తప్పుతున్న ఆదివాసి యువత

  • బతుకు చిద్రం
  • గతి తప్పుతున్న ఆదివాసి యువత..
  • చదువులకు దూరమై చెడు వ్యసనాలకు బానిసై.
  • జీవితాలు ఆగమాగం

    మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 06:

చెడు వ్యసనాలే వారి జీవితాలకు శాపం అవుతున్నాయి . చెప్పేవారే లేరని కొందరు చెప్పిన మాట వినని వారు మరికొందరు చెడు వ్యసనాలు వారి బతుకులు చిద్రం చేసుకుంటున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. పెద్ద చదువులు చదువుకొని జీవితాలను చక్కదిద్దుకోవడమే కాకుండా కనిపించిన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటారని రెక్కలు ముక్కలు చేసుకుని కూలి పనులకు వెళుతూ కన్న కొడుకులను పెంచుతున్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగులుస్తున్నారు. చదువుకొని బతుకులను బాగు చేసుకుంటాడని కలలుగన్న ఆ తల్లిదండ్రులకు మధ్యలోనే చదువు మానేసి మద్యం ,సిగరెట్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు వ్యసనపరులై అ చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. యుక్త వయసులోనే వ్యసనపరులై. సభ్య సమాజానికి తలనొప్పిగా మారుతున్నారు. ప్రధానంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వ్యసనాలకు బానిసై వారి వారి కుటుంబాలకు బరువై చివరకు జీవత్సవంలా మిగిలిపోతున్నారు యువత మేలుకోవాలని సన్మార్గంలో నడవాలని ప్రభుత్వాలు అనేక విధాలుగా చైతన్య పరుస్తూ వారి చెడు నడవికను మార్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ యువత పెడచెవిన పెడుతున్నారు. లక్ష్యసాధన దిశగా ఎంచుకున్న మార్గాన్ని వారి జీవితాల్లో సుగమనం కావలసింది పోయి మత్తుకు బానిసలై సముదులుగా మిగులుతున్నారు . ఏజెన్సీలో యువత వీటికి ఎక్కువగా బానిస అవుతున్నారు
ప్రధానంగా పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతున్న గంజాయిని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని మేధావి వర్గం ఆరోపిస్తుంది

యువత మేలుకో జీవితాలను సరిదిద్దుకో.. సీఐ దోమల రమేష్..
సమాజం నిత్యం సస్యశ్యామలంగా ఉండాలంటే యువత ఎందుకు ప్రమాద భూమికగా నిలబడాలి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత మేలుకోవాలి వారి జీవితాలను సరిదిద్దుకోవాలి. ప్రతిభ ఉన్న యువతకు
ఉద్యోగ నియామకల్లో ఎటువంటి సహాయం కావాలన్నా పోలీస్ శాఖ తరపున అందిస్తామని దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ తెలిపారు. మండలంలోని యువతి, యువకులు ఎవరైనా వచ్చి తెలిపితే వారికి ఉచితంగా కోచింగ్ మా తరఫున అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ నోటిఫికేషన్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని, యువత చెడు వ్యసనాలకు పోకూడదని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !