UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఏఈఓలపై జిల్లా కలెక్టర్ కు రైతులు పిర్యాదు..

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 09 : మండల వ్యవసాయశాఖ విస్తర్ణాధికారులు సాయిబాను, విజయ లపై జిల్లా కలెక్టర్ అనుదీప్ కు సోమవారం మండల రైతులు గ్రీవెన్స్ లో పిర్యాదు చేశారు.మండలానికి చెందిన రైతులు ఆంగోతు భద్రు,బట్ట పెద్దులు, ధరావత్ ధంజ్యా, ధరావత్ దాసు, ధరావత్ రంగమ్మ, ధరావత్ రుక్కి, ధరావత్ అర్జునలు రూ.58వేలు ఎన్ఎఫ్ఎస్ఎం స్కీం క్రింద నగదు ఏఈఓలు సాయిబాను, విజయ్ లకు కట్టారు. నాటి నుంచి నేటి వరకు నగదు తిరిగి ఇవ్వలేదు. స్కీం క్రింద పంపులు ఇవ్వలేదు. రైతుల నుంచి అధికమొత్తంలో డిడిలు తీసిన దానికంటే వేల రూపాయలు అధికంగా వసూలు చేసినారు. ఐదేండ్లు గడుస్తున్న సరియైనా సమాధానం రైతులకు ఇవ్వకపోవడంతో రైతులు విసుకుచెందారు. దీంతో రైతులు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయటంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అభిమన్యుడికి పిర్యాదుపై విచారణ చేసి, రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఏఈఓలపై తరచూ రైతుల నుంచి పిర్యాదులు వస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్నతాధికారులకు సైతం అవినీతిలో భాగం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !