UPDATES  

NEWS

ఘనంగా ముగిసిన శ్రీ నాగులమ్మ తల్లి సుంకు పండగ… ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్..

 పెద్ద సార్ వస్తున్నారని… అధికారులు హై అలర్ట్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 09 … భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తేదీన నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించుటకు ముఖ్యమంత్రి వస్తున్నందున అన్ని
ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయం ప్రారంభోత్సవంలో అధికారులకు
కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వహించాలని చెప్పారు. ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన నూతన కలెక్టరేట్లోకి అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యాలయాలను పరిశుభ్ర పరిచి అందంగా
అలంకరించాలని చెప్పారు. మంగళవారం సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లును అధికారులు పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమం సజావుగా సక్రమంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు
చేసిన హెలిప్యాడ్ను పరిశీలించారు. బహిరంగసభ నిర్వహించుటకు ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం
చేశారు. అన్ని శాఖల అధికారులు శాఖాపరంగా ప్రగతి నివేదికలు అందచేయాలని చెప్పారు. విదులు కేటాయించిన అధికారులు తక్షణమే ఆయా శాఖల అధికారులకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా, డిఆర్డిఓ మధుసూదన్ రాజు,
డిపిఓ రమాకాంత్, డిసిఓ వెంకటేశ్వర్లు డీఎస్పీ వెంకటేశ్వర బాబు, ఉద్యాన అధికారి మరియన్న, ఆర్డీఓ సులోచనారాణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్
శిరీష, పశుసంవర్ధక అధికారి డాక్టర్ పురందర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !