UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 మదినిండా ఉప్పొంగిన ఉత్సాహం గూడెం అంతా గులాబీ మయం

మదినిండా ఉప్పొంగిన ఉత్సాహం
గూడెం అంతా గులాబీ మయం
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న జనం
సకలం ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 10… బీఆర్ఎస్ పెద్ద బాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా పర్యటిస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాక కోసం గులాబీ శ్రేణులు ఉప్పొంగిన ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పెద్ద బాసును సాదరంగా ఆహ్వానించేందుకు ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు శ్రేయోభిలాషులు ఎదురుచూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్త కూడా నియోజకవర్గ మొత్తం ఇప్పటికే గులాబీమయం అయింది. కొత్తగూడెం రైటర్ బస్తీ లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో నవభారత్ సమీపంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవాలకు స్వాగత బ్యానర్లు అడుగడుగున ఆకాశాన్ని అంటాయి. గబాలిస్తున్న గులాబీ తోరణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతానికి తార్కానంగా నిలిచాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రధాన కూడలిలో గులాబీ జెండాలతో రెపరెపలాడాయి. ప్రత్యేక విద్యుత్, బంతిపూల అలంకరణలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ముస్తాబయింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేత లాంఛనంగా ప్రారంభించుకొనే ఈ కార్యాలయాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ తో పాటు వివిధ శాఖల అధికారులు శక్తి వంచన లేకుండా ముమ్మర ఏర్పాటులో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నుంచి సుమారు 2000 మంది ప్రజలను సమీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కాంతారావు మంగళవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పిలుపునిచ్చారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం తో పాటు పోలీస్ యంత్రాంగం కొత్తగూడెం నియోజకవర్గంలో ఎక్కడికక్కడే భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బంది శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేత ప్రారంభించుకునేందుకు సిద్ధంగా ఉన్న జిల్లా కలెక్టరేట్, బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలను ముందస్తు భద్రత కోసం జిల్లా ఎస్పీ వినీత్ తన పోలీస్ సిబ్బందితో పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కానుండడంతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్కు అంతరాయం కాకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !