మన్యం న్యూస్, అశ్వాపురం జనవరి 12:తెలంగాణ లో బీజేపీ కి చోటు లేదు బి. ఆర్ .ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సమక్షంలోబుధవారం బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శివ్వరపు డాక్టర్ బాబు,శివ్వరపు రవీంద్ర చారి,సోమ అంజిరెడ్డి లు బి. ఆర్. ఎస్ లో చేరగా మొండికుంట లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి రేగా కాంతారావు గులాబీ కండవా కప్పిబి. ఆర్.ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర భవిష్యత్తు బంగారు మయం కావాలంటే బి. ఆర్.ఎస్ తో సాధ్యం అన్నారు. యువత ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలని, సమాజం పట్ల సేవా భావం కలిగి ఉండాలని, యువకులు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు.దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అని అన్నారు . ఈ కార్యక్రమంలో బి. ఆర్ .ఏస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, సీనియర్ నాయకులు జాలే రామకృష్ణారెడ్డి, కందుల కృష్ణార్జున రావు, వెన్న అశోక్ కుమార్, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్ ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
