*ప్రతి మండలానికి పర్మినెంట్ వాలీ బాల్ కోర్టు ఏర్పాటు
* రేగా వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతీ టీం కి వాలీబాల్ కిట్ అందజేత
* ఏప్రిల్ లో నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్
*కొమురం భీమ్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో విప్ ,ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్,అశ్వాపురం: పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాలలో పర్మినెంట్ వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయనబుధవారం
మండల కేంద్రంలో కొమురం భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.తొలుత కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని బ్యాటింగ్ టోర్నమెంట్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక దారుధ్యాన్ని పెంచుతాయన్నారు, క్రీడాకారులు ఆటలో నైపుణ్యాన్ని ఓడిసిపట్టి విజయాలు సాధిస్తూ, క్రీడలు వలన అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను చాట వచ్చు అన్నారు, యువత క్రీడలలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,వైజ్ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గజ్జల లక్ష్మ రెడ్డి,బి.ఆర్. మండల సీనియర్ నాయకులు కృష్ణార్జున రావు,సూదిరెడ్డి గోపాలకృష్ణ రెడ్డి,బీఆరెస్ పార్టీ ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులుఎన్నా అశోక్ కుమార్,ఆ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కొరస దుర్గా రావు,ఆదివాసీ జాక్ మండల అధ్యక్షులు కుంజా రామ రావు,పిసా కమిటి మండల అధ్యక్షులు చాప ముత్తయ్య,బీఆరెస్ మండల యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ,కొమరం భీమ్ టోర్నమెంట్ నిర్వాహకులు కల్లూరి నర్సింహారావు,పాయం సత్తి పండుతదితరులు పాల్గొన్నారు.