మన్యం న్యూస్, పినపాక:
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉప్పాక పంచాయతీలో జనవరి 13, 14, 15 తేదీలలో జరగబోయే ఉపాఖ ప్రీమియర్ లీగ్ (యు పి ఎల్) నకు పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ 5వేల రూపాయలను విరాళంగా అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ పోటీలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రీమియర్ లీగ్ సభ్యులను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్యామల సతీష్, బొనగిరి సాయి కుమార్, గోసంగి పృధ్వీ కుమార్, నక్కల సాయి, గోసంగి వాసు, మార్త పవన్, గూడూరు సతీష్ పాల్గొనడం జరిగింది.