UPDATES  

 సీఎం సభకు వేలాదిగా కదలండి, కదిలించండి.

మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 11: మండల ముఖ్య కార్యకర్తల సమావేశం గోపిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతనస్థానిక మార్కెట్ యాడ్ లో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు వేలాదిగా కదిలి జయప్రదం చేయాలని అన్నారు. బహిరంగ సభ విజయవంతానికి పంచాయతీ వారిగా ప్రణాళిక నిర్వహించుకొని గ్రామాలలోకి వెళ్ళాలని ప్రజలను కదిలించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల ఉపాధ్యక్ష లు మొండెడ్డుల వేంకటేశ్వర రెడ్డి మండల యువజన అధ్యక్షులు గొనెల నాని, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె సాదిక్ పాష, ఉపాధ్యక్షులు గుల్ మొహ్మద్, ఏఎంసి డైరెక్టర్ శ్రీను నాయక్, మండల ఎస్సీ అద్యక్షులు వలదసు సలయ్యా, మండల పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు గంగపురి చంద్రశేఖర్, మండల టౌన్ అధ్యక్షులు సోహెల్ పాషా, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మంద ప్రసాద్, మాజీ జెడ్పిటిసి భూపల్లి నరసింహ రావు, జక్కం సర్వేశ్వర రావు, కొంకంచి శ్రీను, బిట్ర సాయిబాబు, జక్కం శ్రీను, కేసుపక రమేష్, పార్టీనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !