మన్యం న్యూస్,అశ్వాపురం:
మణుగూరు మండలం లోవచ్చే నెల 5 తేదీ నుండి జరగబోవు శ్రీశ్రీశ్రీ భవాని లింగమంతుల జాతర (రేగుల గండి) సందర్భంగా రోడ్డు సదుపాయం, కరెంటు సదుపాయం, మంచినీటి సదుపాయం కొరకు సింగరేణి కాలరీస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ టి. లక్ష్మీపతి గౌడ్ పీకే ఓ సి , డీ. వెంకటేశ్వర్లు ఏ జీ ఎం సివిల్ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వారికి విన్నపించడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ అధ్యక్షులు లంకెల రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గంట గోవర్ధన్ యాదవ్, గౌరవ అధ్యక్షులు మేకల ఆదిలింగయ్య యాదవ్, బొబ్బల నాగేశ్వరరావు యాదవ్, గౌరవ సలహాదారులు రెడ్డి బోయిన సైదులు యాదవ్, తూముసత్యనారాయణ యాదవ్ సాయిల సురేష్ యాదవ్, ఉపాధ్యక్షులు కడారి నరేష్ యాదవ్, నూకల లింగయ్య యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగి మల్లికార్జున్ యాదవ్, గౌరవ సభ్యులు యాదవ్, చంద్రకాని వినీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
