UPDATES  

 సర్వే చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలి – సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల

మన్యం న్యూస్, సారపాక :
బూర్గంపాడు మండలంలో భూములు సర్వే చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
బుధవారం సారపాక పంచాయతీలోని సుందరయ్య సుందరయ్య నగర్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 12న కలెక్టర్ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయనున్న రోజునే బూర్గంపాడు మండలంలో భూములు సర్వే చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాక్కున్న భూములుకు కూడా సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు. గోదావరి వరదలు గ్రామాలపై పడకుండా కరకట్ట నిర్మించాలని ప్రభుత్వంని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలనుతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాపినేని సరోజన, ఎస్.కె అబిదా, కౌవులూరి విలాసాగర్, రజిని,
నాగమణి, సుశీల, కుమార్, చంద్ర, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !