UPDATES  

 రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ లో సత్తా చాటిన ఎక్స్ లెంట్ విద్యార్థి…

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 12: రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ లో మణుగూరు ఎక్స్ లెంట్ స్కూల్ విద్యార్థి సత్తా చాటాడు. ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ లో ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్నోవేషన్ విభాగంలో ఆటో లైట్ మెకానిజం ఆటో కల్వర్టు ప్రాజెక్టులో మణుగూరు ఎక్స్ లెంట్ పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎండి రయాన్ నజీఫ్ రాష్ట్ర స్థాయి తృతీయ బహుమతి సాధించాడు. ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ టెక్నాలజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ మశ్రఫ్ ఫారూఖ్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్స్ యూసఫ్, గబ్బర్,ఖాదర్,ఖాన్ హర్షం వ్యక్తం చేస్తూ సైన్స్ ఫెయిర్ లో విద్యార్థికి ఈ బహుమతి రావడానికి కారకులైన, ఉపాధ్యాయులు సురేష్, వెంకట్, సుజాత లను గురువారం అభినందించారు. పాఠశాలలో ఆ విద్యార్ధికి చిరుసత్కారం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !