UPDATES  

 ఉప్పేడ్ వీరాపురంలో రెవెన్యూ సదస్సు

మన్యం న్యూస్ ,వెంకటాపురం:
మండలం లోని ఉప్పెడు వీరాపురం, కోయ బెస్త గూడెం మూడు గ్రామాల పరిధిలో గురువారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సులో మండల తహసిల్దార్ టీ నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు ధరణి పోర్టల్ నూతనంగా ప్రవేశ పెట్టిన ఆప్షన్లను వివరించారు.అలాగే చనిపోయిన వారి జాబితా నుండి పట్టాలని ఎలా మార్చుకోవాలో రైతులకు తెలియజేశారు.
అలాగే పట్టా పాస్ బుక్ వచ్చి ఉండి దాని మీద పేర్లు తప్పు పడితే వాటిని ఎలా సరిచేసుకోవాలో వారికి అవగాహన కల్పించారు. భూములకు సంబంధించిన విషయాలని ప్రతి ఒక్కటి తమకు తెలియ చేయాలని, తద్వారా దానికి సంబంధించిన పరిష్కారాలను రెవెన్యూ శాఖ చూపెడుతుందని తాసిల్దార్ తెలిపారు. ఈ సదస్సులో సర్పంచ్ తురసం సూరిబాబు, ఆర్ ఐ, వీఆర్ఏ రజిత పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !