UPDATES  

 పేకాట స్థావరం పై పోలీసులు దాడి…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ జనవరి 13 : మండలంలోని తిప్పనపల్లి గ్రామ శివారు మహమ్మద్ నగర్ గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై శుక్రవారం ఎస్సై విజయలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాట స్థావరం నుంచి రూ. 2500 నగదు, ఒక ద్విచక్ర వాహనం, స్వాధీన పరుచుకొని నలుగురు పేకాటరాయులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !