UPDATES  

 బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం మహా సభకు చీమల దండులా తరలి రావాలి.. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు..

మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 13, ఖమ్మం జిల్లా, వైరా పట్టణంలోనీ కమ్మవారి కల్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల18వ తారీఖున ఖమ్మంలో జరగబోయే బిఆర్ఎస్ పార్టీ జాతీయ మహా సభ ను విజయవంతం చేయాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొట్ట మొదటి మహాసభ ఈ జిల్లాలో జరగటం,ఈ జిల్లా ప్రజల అదృష్టమని, అందుకు ప్రతి గ్రామము నుంచి, ప్రతి పట్టణం నుంచి చీమల దండులా పార్టీ శ్రేణులు కదిలి రావాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి నినాదాలతో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా నాయకులు పని చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ కోరిక మేరకు వైరా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కన్వీనర్ పల్లారాజేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వైరా నియోజకవర్గ సభ ఇంచార్జ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, నియోజకవర్గంలోని జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !