UPDATES  

 ఉరిమే ఉత్సాహం… నింగి నేల హద్దుగా యువత ఉప్పొంగాలి క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 13: రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మణుగూరు లో నిర్వహిస్తున్న క్రీడాపోటీలు శుక్రవారం ఆఖరి రోజుకు చేరుకున్నాయి. మణుగూరు జడ్పీ కో ఎడ్యుకేషన్ హై స్కూల్ లో జరిగిన వాలీబాల్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం జరిగిన వాలీబాల్ పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఒకరిని మించి ఒకరు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహిళలకు మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించారు. చిన్నారులు మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీలో  పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !