మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 13: సింగరేణి సంస్థ అందజేస్తున్న అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు ఏరియా జిఎం వెంకటేశ్వర రెడ్డి శుక్రవారం అన్నారు. సింగరేణి యాజమాన్యం తన వంతు సామాజిక బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందన్నారు. సింగరేణి కుటుంబాల మహిళలతో సమానంగా స్థానిక, పరిసర గ్రామాల మహిళలకు అనేక రకాల వృత్తి విద్యల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు పోలీస్, ఆర్మీ శాఖలో ఉచిత శిక్షణ ఇవ్వడంతో ఆయా శాఖల్లో ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ఆఖరి అంశమైన వ్రాత పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను పీవీ కాలనీ సిఈ ఆర్ క్లబ్ గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలన్నారు.
