మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 13: ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, ఉత్పత్తి సాధించే దశలో రక్షణ మరువ వద్దని ఏరియా రక్షణ అధికారి వెంకటరమణ అన్నారు. ఆయన శుక్రవారం పైలట్ కాలనీలోని దుర్గా ఓబి కంపెనీలో నిర్వహించిన ప్రమాదాల నివారణ కాంట్రాక్ట్ కార్మికుల బాధ్యత అనే అంశంపై పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారీ యంత్రాలకు ప్రత్యేకించి షావెల్ మిషన్లకు ఇంధనం నింపేటప్పుడు సంబంధిత ఆపరేటర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం సామూహిక రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ శ్మాలోత్ రాముడు, సీనియర్ అండర్ మేనేజర్ రాజారాం సూపర్వైజర్ దుర్గాప్రసాద్, దుర్గా ఓబి కంపెనీ ( ఓసి-4) మేనేజర్ ముత్తుకుమార్, ఎస్ ఓ పి సమన్వయకర్త నా సర్ పాషా, దుర్గా సిబ్బంది అఫ్జల్,సాయి, విజయ్ తదితరులు పాల్గొన్నారు
