మన్యం న్యూస్,ఇల్లందు:
₹ ఈ నెల 18న ఖమ్మం లో తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను రూపొందించారు. ఈ గోడ పత్రికను రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ,ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు చేతుల మీదుగా ఇల్లందులో జరిగిన కార్యక్రమంలోశనివారం ఆవిష్కరించడం జరిగినది. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు ఉద్యోగులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మంత్రి హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ,ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, వీరయ్య రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారేపల్లి వెంకట్ కార్యదర్శులు రమేష్ బాబు విజయ్ కుమార్ సోషల్ మీడియా ఇంచార్జ్ మోహన్ నాయక్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు గుప్తా , భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సుంకరి రంగారావు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
