మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 16: ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ బారి బహిరంగ సభనువిజయవంతం చేయాలని మణుగూరు జడ్పిటిసి పోశం నర్సింహారావు అన్నారు. ఆయన సోమవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జనసమీకరణ కోసం నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. మొట్ట మొదటి సారిగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించడం జరుగుతుందని, మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలన్నారు. ఈకార్యక్రమంలో మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు, మండల రైతు బంధు అధ్యక్షులు రామసానివెంకట్ రెడ్డి, పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సాగర్ యాదవ్, నాయకులు పప్పుల ప్రసాద్, గువ్వా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
