UPDATES  

 30 న మాదిగల ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలి… – మాదిగ ఐక్యవేదిక అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి.

మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 17: ఈ నెల 30 న జరిగే మాదిగల ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలని మాదిగ ఐక్యవేదిక అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి కోరారు. ఆయన మంగళవారం స్థానిక హనుమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పినపాక నియోజకవర్గ మాదిగల ఐక్య వేదిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మాదిగలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారిని అన్ని రంగాలలో చైతన్యం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మాదిగల ఐక్యత కోసం ఏర్పాటుచేసిన మాదిగ ఐక్యవేదికను ముందు ముందు అభివృద్ధి పరిచేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి వెల్ఫేర్ అసోసియేషన్ రీజన్ ఇంచార్జ్ కాజీపేట కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శనగరపు కుమార్ స్వామి,నరసింహారావు, కుర్రి రాజేశ్వరరావు ఇదినూరు రాజేష్, మామిడి జగన్మోహన్, మంద కోటేశ్వరరావు, నై నారపు నాగేశ్వరావు, డిసిసిబి మాజీ డైరెక్టర్ బోయిళ్ళ రమణయ్య, సాంబ పోడుతూరి ప్రసాద్, ఇసంపల్లి కృష్ణ, పోడుతూరి విక్రమ్, బోయిళ్ళ రాజు, అవులూరి రమేష్, మల్లేష్, మంద హుస్సేన్, ఇసంపల్లి పున్నారావు, ఐక్యవేదిక మీడియా ఇంచార్జ్ సిద్దెల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !