మన్యం న్యూస్ అద్భుతాలు సృష్టిస్తుంది….
– సంచలనాత్మకమైన కథనాలతో సమస్యల పరిష్కారం.
మన్యం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు.
మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 17: మన్యం న్యూస్ దినపత్రిక అద్భుతాలు సృష్టిస్తుందని మన్యం న్యూస్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం స్థానిక మౌనిక ఫంక్షన్ హాల్ లో మన్యం న్యూస్ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం న్యూస్ లో వచ్చే అద్భుతమైన కథనాలతో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. కొన్ని రోజుల్లోనే ప్రధాన పత్రికలకు దీటుగా మన్యం న్యూస్ లో కథనాలు వెలువడుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మన్యం న్యూస్ పత్రికను విస్తరింపచేస్తామన్నారు. అనంతరం మన్యం న్యూస్ సీఈవో కంది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మన్యం న్యూస్ లో వచ్చిన కథనాలతో అధికారులు స్పందించి అనేక సమస్యలు పరిష్కారం చేశారన్నారు. ఇదే స్ఫూర్తిగా మన్యం న్యూస్ కుటుంబ సభ్యులు మరింత ముందుకు సాగాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేగా కాంతారావు మన్యం న్యూస్ కుటుంబ సభ్యులకు ఐడి కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మన్యం న్యూస్ కుటుంబ సభ్యులు మన్యం న్యూస్ చైర్మన్ రేగా కాంతారావు, సీఈవో కంది రామచంద్రారెడ్డి, ఆర్ఎం దామోదర్ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మన్యం న్యూస్ బిఎం మందాడి అరవింద రెడ్డి, జిల్లా స్టాపర్ సీమకుర్తి రామకృష్ణ, మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు, అంబానీ న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా స్టాపర్ కొట్టి నవీన్, సీనియర్ పాత్రికేయులు పిండిగ వెంకట్, మన్యం న్యూస్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
