మన్యం న్యూస్, భద్రాచలం జనవరి 17
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి స్వామివారి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో వేద ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాన్ని వేద పండితులు మంత్రి మల్లారెడ్డి కి అందజేశారు.
