UPDATES  

 గ్రామీణ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుంది… ప్రభుత్వ విప్ రేగా

గ్రామీణ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుంది… ప్రభుత్వ విప్ రేగా
క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం

మన్యం న్యూస్,అశ్వాపురం, జనవరి 19.. గ్రామీణ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేయూతనివ్వడమే కాకుండా ప్రతిభను చాటుకుంటున్న క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. గురువారం
మండల కేంద్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ మండల స్థాయి జరిగిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15వేల రూపాయల నగదును విజేతలకు అందజేశారు.ఈ సందర్భంగామాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర సర్కార్ పెద్ద పీట వేస్తున్నదని అన్నారు, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు, గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా యువత ప్రతిదానిని స్వీకరించి తమ తమ రంగాలలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని యువత పెడదారి పడకుండా క్రీడలలో పాల్గొనడం వలన శరీరం దృఢంగా ఉండడమే కాకుండా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణగోపాలకృష్ణ రెడ్డి, వెన్న అశోక్ కుమార్ గజ్జల లక్ష్మరెడ్డి మర్రి మల్లారెడ్డి పెద్దారెడ్డి కోర్స దుర్గరావు కుంజా రామారావు నేలపట్ల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !