UPDATES  

 రక్తదానం చేసి ప్రాణదాతలు కండి… – రేగా బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో రక్తదానం.

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి…
– రేగా బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో రక్తదానం.
– పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి.
మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 20: ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగాసుధారాణి అన్నారు. శుక్రవారం రేగా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మణుగూరు మండలం పగిడేరుకు చెందిన తెల్లం కళావతికి అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం కాగా మణుగూరు లోని స్ప్రింగ్ హాస్పిటల్లో రేగా అభిమాని, సోషల్ మీడియా వారియర్ తాళ్లపల్లి నాగరాజు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్టే అన్నారు. రేగా బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్పటికే ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగింది అన్నారు. అత్యవసర పరిస్థితులలో ఎవరికి రక్తం కావాలి అన్న రేగా బ్లడ్ బ్యాంక్ సభ్యులు వెంటనే స్పందించి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కటుకోజ్వాల వేణు, బీఆర్ఎస్ పార్టీ మణుగూరు పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్, యువజన నాయకులు జక్కం రంజిత్, డాక్టర్ సంఘమిత్ర, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !