మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 20.. లెన్స్ క్లబ్ ఆఫ్ మిలీనియం కొత్తగూడెం, లెన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం సమర్పణ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రూ. లక్ష రూపాయలు విలువగల తోపుడు బండ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి తహసిల్దార్ కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతు చుంచుపల్లి మండలం లో లయన్స్ క్లబ్ ఆఫ్ మిలీనియం కొత్తగూడెం ,లయన్స్ క్లబ్ ఆఫ్ సమర్పణ అధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సమర్పణ అధ్యక్షురాలు కావ్య జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారులకు ఒక లక్ష రూపాయల విలువగల 12 తోపుడు బండ్లు పంపిణీ చేయడం ఎంతో గొప్పదైనదని అన్నారు మరిన్ని సేవా కార్యక్రమాల్లో ఈ క్లబ్బులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమములో అధ్యక్షురాలు కావ్య మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని,చిరు వ్యాపారులకు అసరా గా వారి వారి వృత్తి రీత్యా బండ్లు వాడుకోవడానికి పనిచేస్తాయని ఇప్పటికీ చాలా పేద వారికి అండగా నిలిచమని రానున్న రోజుల్లో కూడా అనేకమైన కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని లయన్స్ క్లబ్ లో పనిచేయడంలో దొరికే సంతృప్తి ఎందులో దొరకదని ఆమె తెలిపారు
ఈ కార్యక్రమములో: లయన్ ఎ.బి చారి,లయన్ పితాని సత్యనారాయణ,లయన్ గబ్బేడ రాజయ్య,లయన్ రాయల శాంతయ్య,లయన్ పల్లపు వెంకటేశ్వర్లు,గబ్బేడ విజయలక్ష్మి,లయన్ గుత్తుల శ్రీనివాస్, టీఎన్జీ ఈఓ అధ్యక్షులు రామారావు తదితరులు పాల్గొన్నారు.
