UPDATES  

 హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క

మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
మధిర ఎమ్మెల్యేమల్లు భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం లో మధిర మండల గ్రామ శాఖ అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి 40 రోజుల పాటు హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభం అవుతుంది అని మండలంలో ప్రతి గ్రామానికి ఇంటింటికి కాంగ్రెస్ నాయకులు తిరిగి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు వినిపించి కరపత్రం అందచేయాలి అన్నారు.మండలం లో బ్లాక్ కాంగ్రెస్,మండల కమిటీ ఆధ్వర్యంలో మధిర పట్టణం లో పట్టణ కమిటీ, డివిజన్ కమిటీ లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో, పట్టణం లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సందేశం వినిపించాలి అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !