UPDATES  

 బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలి సిడిపిఓ కనకదుర్గ

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 21.. సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఐసిడిఎస్ పాల్వంచ సెక్టార్ సిడిపిఓ కనకదుర్గ ఉన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి పల్లి మండలం గట్టు మల్ల పంచాయతీ గంగమ్మ కాలనీ మినీ చత్తీస్గడ్ వలస గుత్తి కోయిల అంగన్వాడి కేంద్రంలో జాతీయ బాలిక వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న కనకదుర్గ మాట్లాడుతు బాలికల విద్య ఆవశ్యకతను వివరించడం జరిగింది. బాలికల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి వారి అభివృద్ధికి తోడ్పడేలాగా కృషి చేయాలని అన్నారు సమాజంలో బాలికలను చదవనిద్దాం ఎదగనిద్దాం అభివృద్ధి చెందనిద్దాం అనే నినాదంతో సాధికార బాలికలు…. సాధికార సమాజం నిర్మించాలని పిలుపునిచ్చారు అలాగే బాల్యవాహాలు నిర్మూలన చేసి చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం ను తీర్చిదిద్దామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అనంతరం ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి సందర్శించి రికార్డ్స్ స్టాకు ఆరోగ్య లక్ష్మి భోజనం ప్రీ స్కూల్ కార్యక్రమాలు చూసి బాలింత కుటుంబలను సందర్శించి గర్భిణీ బాలింతలకు జాగ్రత్తలు చెప్పటం జరిగింది ఈ కార్యక్రమము లో సూపర్వైజర్ అశోక్ కుమారీ ఉప సర్పంచ్ బొట్టు వెంకటేశ్వర్లు అంగన్వాడీ టీచర్ బానోత్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !