మన్యం న్యూస్, భద్రాచలం :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజనుడికి అందే విధంగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని ఐటిడిఓ పరిపాలన అధికారి భీమ్ అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిడి రమాదేవి తో కలిసి, వివిధ గ్రామాల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు కృషి చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్ బాబు, అగ్రికల్చర్ ఏడి భాస్కరన్, విద్యుత్ శాఖ అధికారి మునీర్ పాషా, ఐటీడీఏ మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, హెచ్ఈఓ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.