మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాజ్యసభ సభ్యులు, గాయత్రి గ్రానైట్స్ అధినేత, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలను మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ హాజరయ్యారు. మండల మున్నూరు కాపు సంఘం ప్రముఖుల సమక్షంలో రవిచంద్ర పుట్టినరోజు కేక్ ను ఎమ్మెల్యే రాములు నాయక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బాల్యం నుంచి ఎంతో కష్టపడి అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు. పేదల అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమని అన్నారు. వైరా నియోజకవర్గంలో మున్నూరు కాపుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఎదళ్ళపల్లి వీరభద్రం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు బాపట్ల మురళి, మండల ప్రముఖులు బొడ్డు కృష్ణయ్య, వడ్డే వెంకటనారాయణ, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, పెంటికల వీరబాబు, చౌడం నరసింహారావు, సీరంశెట్టి రామారావు, రామిశెట్టి నాగేశ్వరరావు, మల్లెల నాగేశ్వరరావు, బైరవేణు, బాపట్ల పూర్ణచంద్రరావు, అరిగెల రామారావు తదితరులు పాల్గొన్నారు.