UPDATES  

 పద్ధతి మార్చుకోకపోతే ఎలా అశ్వాపురం మండల అధికారులపై ఎమ్మెల్యే రేగా ఆగ్రహం

 

మన్యం న్యూస్, అశ్వాపురం, జనవరి 25
అశ్వాపురం మండలం లో ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని ముందే తెలిపినప్పటికీ అయినా కూడా తహసిల్దార్ గాని ఎంపీడీవో గాని సమయానికి రాకుండా తమాషాలు చేస్తున్నారా.. అంటూ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అశ్వాపురం మండలలంలో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రేగా సమయానికి హాజరైనప్పటికీ అధికారులు లేకపోవడం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న ఆ మండల అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజా ప్రతినిధులను సైతం లెక్కచేయకుండా ఆ ఇద్దరి అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇష్టం లేని అధికారులు ఈ మండలం నుంచి వెళ్ళిపోతే మంచిదని మరోసారి ఇలా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !