మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 25…ఓటు తరతరాల గతిని మార్చిన అస్త్రం. బ్రష్టు పట్టినవ్యవస్థకు చరమగీతం పాడే వజ్రాయుధం ప్రజాస్వామ్యంలో వినిపించే గొంతుక
ఓటు హక్కును వినియోగించుకుందాం..
ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అవుదామని కొత్తగూడెం మున్సిపాలిటీ 25 వార్డు కౌన్సిలర్ సాహెరా బేగం పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం అని పురస్కరించుకొని స్థానిక గాజుల రాజం బస్తీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును బ్రహ్మాస్త్రంలా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు, అలాగే గాజుల రాజం బస్తీ ప్రభుత్వ పాఠశాల నందు చిన్నారులతోటి ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి , పెన్నులు, పెన్సిళ్లు, బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో , తహసిల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సిరాజ్ స్కూల్ హెడ్ మాస్టర్ , అంగన్వాడి టీచర్లు, మట్టా రాజకుమారి ,శ్రీదేవి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
