మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 25: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్, పైలెట్ కాలనీ ఏరియాకు చెందిన
మన్నూరు భాగ్యలక్ష్మి 20000, జక్కుల సౌజన్య 22000, చిన్నాల వెంకటమ్మ 60000, వెన్నం శివకుమార్ 18000 రూపాయల నగదు చెక్కులను జడ్పిటిసి పోశం నరసింహారావు చేతుల మీదగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరావు, బిఆర్ఎస్ పార్టీ మండల, టౌన్ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, షేక్ బాబ్ జానీ, ముద్ధంగుల కృష్ణ, ఎడ్ల శ్రీనివాస్, నూకారపు రమేష్, కొర్లకుంట అప్పారావు, యువజన నాయకులు గుర్రం సృజన్, జక్కం రంజిత్, మండారి సతీష్, నాని, గుంటక ఏశావు, తాళ్లపల్లి నాగరాజు, షేక్ బాజీ, డేగలసంపత్, సిరికొండ సంగీత్ తదితరులు పాల్గొన్నారు.
