ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం సిద్ధంగా ఉండండి…
-తినబోయే ముందు రుచి ఎందుకు.
-గతంలో ఆయన చేసింది శూన్యం.
– 10 సంవత్సరాలలో పనిచేయడం చేతకాలేదు.
– శత్రుత్వం పెంచుకోవద్దు మితృత్వం పెంచుకోవాలి.
-ఎన్నికల తరుణం వచ్చేసింది.
-కొంతమంది దండయాత్రల పేరుతో వస్తున్నారు.
-కార్యకర్తలు రణ రంగంలో దిగాలి.
-దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కడే.
-పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.
మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 26: ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సైనికులేనని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన గురువారం మణుగూరు జడ్పీ కో ఎడ్యుకేషన్ హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన పినపాక నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మూడ్ వచ్చేసిందని ప్రతి ఒక్కరూ ప్రచారం చేసే పనిలో నిమగ్నమవ్వాలన్నారు. నాయకుడు సూచిస్తే తూచా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. దండయాత్రల పేరుతో కొంతమంది వస్తున్నారని కార్యకర్తలు రణరంగంలోకి దిగాలన్నారు. 29 రాష్ట్రాల్లోని సీఎం ల కన్నా మన సీఎం కేసీఆర్ ఒక్కడే దమ్మున్న మొనగాడని, అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తూ అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. బిజెపి నాయకత్వానికి సవాల్ విసిరుతున్నానని, 19 రాష్ట్రాల్లో మీరు అమలు చేస్తున్న పథకాలు తీసేస్తామని ప్రకటించేంత దమ్ముందా అన్నారు. తెలంగాణ గడ్డమీద కొచ్చి ఉచితాలు అంటే ఊరుకునేదే లేదన్నారు. పేద ప్రజలంతా పూర్తిగా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని, తినబోయే ముందు రుచి ఎందుకన్నారు. 2023 ఎన్నికల్లో మనకు అసలు పోటీ లేదన్నారు. గతంలో ఉన్నవాళ్లు నియోజవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అని, ఇప్పుడు నేను నిధులు తీసుకొస్తూ ఉంటే వంకలు పెడుతున్నాడన్నారు. ప్రజలు 10 సంవత్సరాలు అవకాశం కల్పిస్తే పనిచేయడం చేతకాలేదన్నారు. నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు. రానున్న రోజుల్లో పులుసుబొంత నుండి ఒడ్డుగూడెం వరకు నీరు కుండలా ప్రవహిస్తుందన్నారు. రానున్న రోజులలో రాష్ట్రానికే ఆదర్శంగా పినపాక నియోజకవర్గం నిలుస్తుందని, అన్ని కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, వీధి లైట్లు సోలార్ సిస్టం తోనే నడుస్తాయని, కరెంటు బిల్ సమస్య ఉండదన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను బీఆర్ఎస్ ఖాతాలో వేసుకొని సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇస్తున్నామన్నారు. ఇక సమయం లేదని ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజాసేత్రంలో కెళ్ళి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మనం శత్రువులను కూడా ప్రేమించాలని వ్యూహాత్మకంగా పోవాలన్నారు. ఇగోని తగ్గించుకోవాలని, శత్రుత్వం పెంచుకోకుండా మిత్రుత్వం పెంచుకోవాలన్నారు. పార్టీ మండల అధ్యక్షులు ఎంపీపీ, జడ్పీటీసీలను కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయాలన్నారు. మండల ఇన్చార్జీలు వారి మండలాల్లో అత్యధిక మెజార్టీ తీసుకువచ్చేందుకు కృషి చేయాలి అన్నారు. ప్రచార లోపం జరిగితే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. కమిటీల ఇన్చార్జ్ లు నిత్యం ప్రజల్లోనే ఉండాలని, ప్రభుత్వ పథకాలను నేరుగా వారికి చేరవేయాలన్నారు. ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
