మన్యం న్యూస్, పినపాక, జనవరి 26
మండలంలోని తోగ్గూడెం పంచాయతీలో జనావాసానికి దూరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆదివాసీ గ్రామం టేకులగూడెం. అక్కడ గల మినీ అంగన్వాడీ కేంద్రంలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడి కార్యకర్త చంద్రకళ జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రతిరోజు వారికి అక్షర జ్ఞానం నేర్పుతూనే, గణతంత్ర దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్పదనం గురించి, రాజ్యాంగం ప్రకారం మానవజాతికి ప్రసాదించిన హక్కుల గురించి అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ వివరించారు. ఈ కార్యక్రమంలో టేకులగూడెం గ్రామ ప్రజలు, అంగన్వాడీ విద్యార్థులు పాల్గొన్నారు.