మన్యం న్యూస్, ఖమ్మం ప్రతినిధి: పి. డి. ఎస్. యూ ఆధ్వర్యంలో ఈనెల 4నఅసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనిపి. డి. ఎస్. యూ ఖమ్మం డివిజన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.పి. డి. ఎస్. యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏ. ఎస్. అర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పి. డి. ఎస్. యూ ఖమ్మం డివిజన్ ప్రధాన కార్యదర్శి తిప్పరపు. లక్ష్మణ్ మాట్లాడుతూ …
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని, ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డీమాండ్ చేస్తూ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నూతన జాతీయ విద్యా విధానన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రద్దు చేయాలని డీమాండ్ చేస్తూ ,ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి. డి. ఎస్. యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ నాలుగోవా తేదీన చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విద్యార్థులు విద్యావంతులు జయప్రదం చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యకు అధిక శాతం నిధులు ఇస్తామని చెప్పిన కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 నుండి ప్రతి బడ్జెట్లో విద్యకు తక్కువ శాతం నిధులు తగ్గిస్తు పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వంమేనని వారు ఎద్దువా చేశారు.
రాష్టంలో విద్యారంగ అభివృద్ధికి నిధుల శాతం పెంచడం లేదని , రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి మొన్నటి 2022 బడ్జెట్ వరకు కూడా నామమాత్రం నిధులు ఇస్తూ విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చేస్తుందని ఇలా అయితే తెలంగాణ రాష్టంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యమాలకు కిల్లా అయిన ఖమ్మం జిల్లా కు జనరల్ యూనివర్సిటీని కేటా ఇస్తామని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నుండి నేటి తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినా కెసిఆర్ వరకు ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక ప్రకటనలు చేశారు కానీ ఇప్పటివరకు జిల్లాకు యూనివర్సిటీ ప్రస్తావన చేయకపోవడం సిగ్గుచేటన్నారు, ఇప్పటికైనా కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం విద్య వ్యవస్థపై చిత్తశుద్ధి ఉంటే విద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% కేటాయించాలని మరియు జిల్లా కు ప్రభుత్వాన్ని యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు..ఈ సమస్యల పరిష్కారం కై విద్యార్థులు, విద్యావంతులు పి. డి. ఎస్. యూ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పి. డి. ఎస్. యూ ఖమ్మం నగర కార్యదర్శి కరుణ్, నాయకులు సాయి, నరేష్, రాకేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
