UPDATES  

 పొదెం వీరయ్యని విమర్శించే నైతిక విలువ రేగా లేదు – కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి చక్రవర్తి, మహ్మద్ ఖాన్

 

మన్యం న్యూస్, సారపాక , ఫిబ్రవరి 03

భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు పొదెం వీరయ్యని విమర్శించే నైతిక విలువ ఎమ్మెల్యే రేగా కాంతారావుకి లేదని కాంగ్రెస్ పార్టీ పిసిసి నెంబర్ తాళ్లూరి చక్రవర్తి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి లు అన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… భద్రాచలం శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య పై కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలకు సరికాదని పేర్కొన్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసి ఊసరవెల్లిలా రంగులు మార్చే రేగ కాంతారావు కు భద్రాచల శాసనసభ్యులు పొదెం వీరయ్యని విమర్శించే అర్హత, నైతిక విలువ లేదని ఎద్దేవా చేశారు. ఇంకొకసారి పొదెం వీరయ్య పై అవాకులు, చవాకులు పేలితే రాబోవు ఎన్నికల్లో ప్రజలే  సరైన రీతులో బుద్ధి చెపుతారు అని  ఘాటైన వాక్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల గౌరవ అధ్యక్షులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కనితి కృష్ణ, మండల మైనార్టీ ఉపాధ్యక్షులు నయీమ్, బూర్గంపాడు మైనార్టీ టౌన్ అధ్యక్షులు పాష, మైనార్టీ టౌన్ సెక్రెటరీ హుస్సేన్, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు చోటే తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !