UPDATES  

 ఎంపీపీ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 03…
మండల కేంద్రంలోని స్థానిక ఎంపిపి కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులైన 9 మందికి చెక్కులను ఎంపిపి గుమ్మడి గాంధీ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, తెలంగాణ అడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా, ఇంటి మేన మామ మాదిరిగా నిలబడ్డారని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, బిఅర్ఎస్ పార్టీ పినపాక మండల ప్రధాన కార్యదర్శి పొలిశెట్టి సత్తిబాబు, అర్.ఐ వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !