మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 06: మండలంలోని దమ్మక్క పేట పంచాయతీ 86వ బూత్ ఇన్చార్జిగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముత్యం బాబు, జడ్పిటిసి పోషం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి రామిడి రామిరెడ్డిలు మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో మన నాయకుడు రేగా కాంతారావుని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సన్నద్ధమై సిద్ధంగా ఉండాలన్నారు. నిజాయితీగా పనిచేసి మన నాయకున్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన భుజాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
