మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 06
పినపాక మండలం నూతన తహసిల్దారుగా చల్లా ప్రసాద్ నియమితులయ్యారు. గతంలో ఆయన అశ్వరావుపేట మండల తహాసిల్దారుగా పనిచేశారు. ప్రస్తుతం పినపాక తహాసిల్దార్ గా పనిచేస్తున్న ఉషా శారద బదిలీ కావడంతో, చల్లా ప్రసాద్ పినపాక మండలానికి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా అధికారం చేస్తానని అన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
