UPDATES  

 అంగరంగ వైభవంగా లింగమంతుల స్వామి జాతర… -భారీగా తరలివచ్చిన భక్తులు.

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 06: మండలంలోని రేగుల గండి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న యాదవుల ఆరాధ్య దైవం శ్రీ భవాని సమేత లింగమంతుల స్వామి జాతర సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో జాతర కన్నుల పండుగగా కనిపించింది. కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి, ఖమ్మం పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు యాదవ్, ఖమ్మం జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కడగాని పరమేష్ యాదవ్ లు జాతరలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జాతర కార్య నిర్వాహన అధ్యక్షులు లంకల రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గంటా గోవర్ధన్ యాదవ్, కార్యనిర్వహణ కార్యదర్శి, మంగి మల్లికార్జున్ యాదవ్, మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, సర్పంచులు ఏనిక ప్రసాద్, బచ్చల భారతి, కొమరం జంపేశ్వరి, కోడి అమరేందర్ యాదవ్, గుడిపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !