వినియోగదారులపై అదనపు చార్జీలను తగ్గించాలి.
రైతులకు నిరంతరాయ విద్యుత్ అందించాలి.
ఏఈ కు వినతి పత్రం అందజేసిన సిపిఐ పార్టీ నాయకులు
మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 06
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం సబ్ స్టేషన్ లో సోమవారం ధర్నా కార్యక్రమం జరిగింది. వినియోగదారులపై విద్యుత్ అదనపు చార్జీలను తగ్గించాలని, రైతులకు నిరంతరాయ విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఏఈ కావ్య కు వినతి పత్రం అందజేస్తూ, పై అధికారులకు ఈ విషయాన్ని తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. రైతులపై దయతలచి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినట్లయితే, రైతు కంట ఆనందం ఉంటుందని తెలియజేశారు. ఈ విషయమై స్పందించిన ఏఈ కావ్య ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియపరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కమిటీ నాయకులు పద్మనాభ రాజు, మండల కార్యదర్శి మనోహర్ చారి తదితరులు పాల్గొన్నారు.
