సలాం ..ఆదాం భాయ్
రేగా నా ప్రాణం
రేగన్న ప్రతి పనిని ప్రజలకు క్షణాల్లో చేరవేయ్యడం నా ధ్యేయం
2009 నుంచి రేగా తోనే అలుపెరగని పయనం
*ఉమ్మడి గుండాల చీకట్లు తొలగించిన ఘనత రేగా దే
బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా నాయకులు,
రేగా వీరాభిమాని,ఎండీ ఆదామ్ పై మన్యం న్యూస్ కథనం
మన్యం న్యూస్,గుండాల(ఆళ్లపల్లి):.. ఫిబ్రవరి 06 ఆయనకు రేగా అంటే ప్రాణం. ఎంతలా అంటే మాటల్లో చెప్పలేము.హైదరాబాద్ పట్టణం నుంచి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బయలుదేరారు అనే సమాచారం అందిందంటే….వెంటనే భుజానికి బ్యాగ్ చేరుతుంది. ఒక్క గంటా ఆలస్యం చెయ్యకుండా ఏజెన్సీ మారుమూలమండలం ఆళ్లపల్లి నుంచి గుండాల గుట్టల మీదుగా మణుగూరు చేరుకుంటాడు.ఆయనే బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా పినపాక నియోజకవర్గ నాయకులు,
రేగా వీరాభిమాని,ఆళ్లపల్లి మండల బి.ఆర్.ఎస్ కోశాధికారిఎండీ ఆదామ్.సోమవారం మన్యం న్యూస్ తో ఆయన చిట్ చాట్.ఆళ్లపల్లి మండలం ఆళ్లపల్లి కి చెందిన ఎం డి ఆదామ్ 2009 సంవత్సరంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆయనతో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు.
గుట్టలు దాటుతూ…భుజాలకు బ్యాగ్ తో
విప్, పినపాక ఎమ్మెల్యే,బి.ఆర్.ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం విడిచి వివిధ పార్టీ పనులకు పట్టణం బాట పట్టడం సహజం. ఈ నేపథ్యంలో రేగా కాంతారావు పట్టణం నుంచి భద్రాద్రి జిల్లా కి పయనం ఐన విషయం తెలిసిన వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయడు. తన సరంగమాతో భుజాలకు బ్యాగు తగిలించుకొని, గుండాల గుట్టలు దాటుతూ పినపాక మీదుగా తన ద్విచక్ర వాహనంతో మణుగూరు క్యాంపు కార్యాలయానికి చేరుకోవాల్సిందే.
ఎమ్మెల్యే రేగా ప్రతి కార్యక్రమం క్షణాల్లో సోషల్ మీడియాలోకి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేగా కాంతారావు పర్యటన ప్రారంభమైందంటే సోషల్ మీడియాలోని వీక్షకులు ఎండీ ఆదాం పోస్టుల కోసం ఎదురుచూడాల్సిందే. ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న కార్యక్రమాలకి అనుగుణంగాతన సెల్ కెమెరా తో వీడియోలు తీసి, తక్షణమే తనకు అందుబాటులో ఉన్న యాప్స్ వినియోగించి వాటినిఅందంగా, ఆకర్షనీయంగా వీడియోలను తీర్చిదిద్దడంతోపాటు ఆకట్టుకునేలా బ్యాక్ గ్రౌండ్ ఆడియో యాడ్ చేస్తాడు. అనంతరం ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వాటిని విస్తృతంగా షేర్ చేయడం జరుగుతుంది. క్షణంలోనే రేగా సమాచారం జిల్లా ప్రజలకు చేరుతుంది.
ఉమ్మడి గుండాల మండలం చీకట్లు తొలగించింది రేగా కాంతారావు
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాకముందు ఉమ్మడి గుండాల మండలం అభివృద్ధికి ఆమడ దూరంతో పాటు, చీకట్లో మగ్గిన విషయం నిజం కదా అని బి ఆర్ ఎస్ మండల నాయకులు ఎండీ ఆదామ్ ప్రశ్నించారు. అలాంటి ఉమ్మడి గుండాల మండలాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన ఘనత ఎమ్మెల్యే రేగా కాంతారావు దక్కుతుందని ఆయన తెలిపారు. ఒకనాడు వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు అనేకమంది ఉన్నారని, వారి బాధలను చూసి చెల్లించిన పినపాక మన్యం బిడ్డ రేగా కాంతారావు నిస్వార్ధంగా తన తెలివితేటలను ఉపయోగించి కోట్ల నిధులతో ఉమ్మడి గుండాల మండలంలో అనేక వాగులపై పెద్ద పెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారని, ఎన్ని జన్మలైన ఉమ్మడి గుండాల ప్రజలు రేగా కాంతారావు రుణం తీర్చుకోలేరని ఆయన అన్నారు. రేగా కాంతారావు విస్మరిస్తే అభివృద్ధి అంద పాతాళమేనని ఆయన ఉమ్మడి గుండాల ప్రజలను హెచ్చరించారు.
చివరగా… రేగాను మంత్రిగా చూడాలనేదే కోరిక
నా ప్రాణం ఉన్నంతవరకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన, చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిని జనాలకు అర్థమయ్యే రీతిలో క్షణాలలో చేరేవేస్తేనే సంతృప్తిగా ఉంటుందని అన్నారు. ఒక టీచర్ నుంచి ఎమ్మెల్యే, విప్, బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎదిగిన మన్యం బిడ్డ రేగా కాంతారావు తనకు ఆదర్శమని, భవిష్యత్తులో రేగాను మంత్రిగా చూడాలని తన తపన అన్నారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా తన వంతు శాయశక్తుల కృషి చేస్తానని ఆయన మన్యం న్యూస్ కి తెలిపారు