UPDATES  

 సిఐటియు పోరాటాల ఫలితంగానే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు 12న అభినందన సభను జయప్రదం చేయండి

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 05
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు నుంచి రూ. 3 వేలకు పెంచిందని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. పద్మ , ఎస్ డి సుల్తానా అన్నారు. ఆదివారం ప్రభుత్వము జీవో ను విడుదల చేయడంపట్ల సీఐటీయూ గా
హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో అప్పులు తెచ్చి వంటలు చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాల ఫలితంగా గత సంవత్సరం అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించి అమలు చేయలేదని అన్నారు . గత సంవత్సరము నుండి జీవో విడుదల చేసి అమలు చేయాలని సిఐటియు చేసిన పోరాటాల ఫలితంగా శనివారం జీవో విడుదల చేసిందని అన్నారు. జీవో విడుదల చేయడం పట్ల సిఐటియు గా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ జీవోను గత సంవత్సరం అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి అమలు చేస్తూ ఏరియర్స్ తో సహా చెల్లించాలని కోరారు. వేతనాల పెంపు జీవో కోసం పోరాటాలు చేసిన మధ్యాహ్న భోజన కార్మికుల అభినందన సభలు అన్ని మండల, కేంద్రాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 12 న సీఐటీయూ జిల్లా కార్యలయంలో అభినందన సభ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !