వైరా బరిలో పొంగులేటి వర్గం అభ్యర్థిగా విజయబాయి..
వైరా నియోజకవర్గ ముఖ్య నాయకుల సమక్షంలో ప్రకటించిన పొంగులేటి..
శీనన్నతో కలిసి పనిచేయడం నా అదృష్టం విజయబాయి..
మన్యం న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 05, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర వర్గంలో భానోత్ విజయభాయి ఆదివారం చేరారు. ఆమెను శ్రీనివాస రెడ్డి సాదరంగా తన అనుచర వర్గం లోకి ఆహ్వానించారు. అనంతరం జూలూరుపాడు మండల సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బానోత్ విజయభాయి పేరును మా అనుచరల అభీష్టం మేరకే ఖరారు చేసామని తెలిపారు. కష్టకాలంలో తన ఎన్నంటే ఉన్న నా అనుచరుల కోసం ఏదైనా చేస్తానని, వారి సూచనలు, సలహాల మేరకే తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇక నుంచి వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విజయబాయి ఆధ్వర్యంలోనే కార్యకర్తలతో సమావేశాలు జరుగుతాయని, తన గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుల పనిచేయాలని కోరారు. విజయభాయి మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనన్నతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రీనన్న ప్రతిష్టను పెంచే విధంగా నడుచుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, రాష్ట్ర మార్కపెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపీటీసీ మధుసూదన్ రావు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..