UPDATES  

 రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి – హత్ సే హత్ జోడో యాత్రను విజయవంతం చేయండి

రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి
– హత్ సే హత్ జోడో యాత్రను విజయవంతం చేయండి
– రేవంత్ రెడ్డి యాత్రకు సంఘీభావం తెలిపిన బట్ట విజయ గాంధీ

మన్యం న్యూస్, భద్రాచలం, ఫిబ్రవరి 05..
రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని  కాంగ్రెస్ నాయకులు బట్ట విజయ గాంధీ ఆకాంక్షించారు. ఆదివారం బూర్గంపాడు నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తూ రేవంత్ రెడ్డి నిర్వహించనున్న హత్ సే హత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం బూర్గంపాడు మండల కేంద్రంలోని సాయిబాబా గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో స్థానిక కార్యకర్తల సైతం భారీగా కదలి వచ్చి బట్ట విజయ్ గాంధీ వెంట నడుస్తూ సంఘీభావం తెలిపారు. బూర్గంపాడు మండల కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొమ్మూరు, రెడ్డిపాలెం, సారపాక గ్రామాల మీదుగా భద్రాచలం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భట్టా విజయ గాంధీ మాట్లాడుతూ… నేడు ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ దేవత మూర్తులను దర్శించుకుని మేడారం గ్రామం నుంచి హత్ సే హత్ జోడో యాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ యాత్ర రెండు నెలల పాటు కొనసాగుతుందని, రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరుగుతుందని వెల్లడించారు.  దేశంలో పెరిగిపోతున్న ధరలు నిరుద్యోగం మతోన్మాదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన మహా పాదయాత్ర సందేశాన్ని ఊరువాడ చేరడానికి హత్ సే హత్ జోడో యాత్రతో ముందుకు వస్తున్న రేవంత్ రెడ్డి అన్న పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరారు. ఇటు దేశంలో అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, భజన సతీష్, మంద నాగరాజు, సోంపల్లి పంచాయతీ సర్పంచ్ తాటి వీరాంజనేయులు, నకిరేపేట పంచాయతీ సర్పంచ్ సర్ప వెంకటేశ్వర్లు, ఉప్పుసాక పంచాయతీ సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు బుర్ర భద్రయ్య, తాటి సత్యనారాయణ, యువజన నాయకులు దునుకు రాము, నిమ్మల హరీష్, ఉసిల్ల భరత్  తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !