మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 07..
మండలంలోని గౌరారం గ్రామంలో మంగళవారం ఫ్రెండ్స్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను బిఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ యువత క్రీడలో రాణించాలని క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని గెలుపోవటంలో సమానంగా తీసుకోవాలని సూచించారు అనంతరం బిఆర్ఎస్ బృందంతో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కనితి రాముడు, ఉపాధ్యక్షుడు కామేశ్వరరావు, ఎంపిటిసి తిరుపతిరావు, ప్రచార కమిటీ అధ్యక్షుడు దామెర్ల శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మోత్కూరి శ్రీకాంత్, నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.