మన్యం న్యూస్, భద్రాచలం, ఫిబ్రవరి 07..
ఆదివాసి మారుమూల గిరిజన గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టుటకు ఫారెస్ట్ వారి ఇబ్బందులు లేకుండా వారి యొక్క అనుమతులతో గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేయవలసి ఉన్నందున, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆర్ అండ్ బి శాఖ వారు రూపొందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఐటిడిఏ కాన్ఫరెన్స్ హాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ అండ్ బి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదివాసి మారుమూల గిరిజన గ్రామాలుకు, బీటీ రోడ్ల నిర్మాణము గిరిజనులకు సౌకర్యంగా ఉండడానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయుటకు పనులు చేపట్టవలసి ఉన్నదని, అందుకు చర్ల, దుమ్ముగూడెం, పినపాక, ఆళ్లపల్లి, గుండాల మండలంలోని 19 గ్రామాలకు గ్రామాలలో బీటీ రోడ్లు నిర్మించుటకు కావలసిన అటవీ అనుమతులు పొందుటకై కావలసిన ప్రొసీజర్ ను ఆర్ అండ్ బి అధికారులు చేపట్టాలని ఆయన అన్నారు. అటవీ భూములకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ యొక్క రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని, గిరిజన గ్రామాలలో ఫారెస్ట్ భూమి బదలాయింపుకి సంబంధించిన కొన్ని అంశాలను ఆర్ అండ్ బి అధికారులకు ప్రాజెక్ట్ అధికారి సూచించారు. భూ బదలాయింపు అంశాన్ని పరిగణ లోకి తీసుకొని ఫారెస్ట్ భూములకు ఆటంకం కలగకుండా గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా పూర్తిస్థాయిలో సర్వే చేసి తనకు ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఆర్ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.